ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ అయిన భారతీయ రైల్వే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుంది. ఈ విధంగా కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తుంది. అయితే రైల్వే లెక్కల ప్రకారం.. సాధారణ మెయిల్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లలో ఒక టికెట్కు రూ.40-50 రైల్వేశాఖ సంపాదిస్తుంది. రాజధాని, శతాబ్ది, వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో ఒక టికెట్కు రూ.100-500 ఆదాయం పొందుతోంది.