కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. గురువారం ఆ జిల్లాలో అతినీలలోహిత కిరణాలు అధికస్థాయిలో ఉన్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. పాలక్కాడ్, మళప్పురం జిల్లాల్లోని త్రితళ, పొన్నణి ప్రాంతాల్లో ఉన్న యూవీ మీటర్లలో ఇది 11 పాయింట్లుగా నమోదైందని, ప్రజలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.