ట్రాక్టర్ నడుపుతూ వరద సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి

55చూసినవారు
ట్రాక్టర్ నడుపుతూ వరద సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) పర్యటించి, సహాయక చర్యల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా చిట్టినగర్ లో మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ సహాయక చర్యలు చేపట్టారు. సహచర టీడీపీ నేతలను ట్రాక్టర్ పై ఎక్కించుకుని, ఆయన వరద నీటిలోనే ట్రాక్టర్ ను నడిపారు. కాగా, మంత్రులు మోకాలి లోతు నీటిలో నడుస్తూ బాధితుల వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్