అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత

65చూసినవారు
అనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత
అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిద్ధాపురం తాండలో తాగునీటి కోసం టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. శుద్ధ జల ప్లాంట్ వద్ద తాగునీరు పట్టుకుంటూ మహిళలు గొడవపడ్డారు. మహిళల గొడవలో వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు. వారిని అడ్డుకోవడానికి టీడీపీ తాండ నాయకులు వచ్చారు. టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ నాయకులు గాయపడ్డారు. ఇరు వర్గాలపై డి.హీరేహాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్