వైఎస్ఆర్ వారసులమంటూ కొందరు ప్రజల్లోకి వస్తున్నారని సీఎం
జగన్ అన్నారు. ఆ మహానేతకు వారసులెవరో ప్రజలే చెప్పాలని అన్నారు.'వైఎస్ఆర్ చనిపోయాక ఆయనపై కేసులు పెట్టింది ఎవరు? ప్రశ్నించారు. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? వైఎస్ఆర్ పేరును కనబడకుండా చేయాలనుకని
కాంగ్రెస్,
టీడీపీ కుట్రలు చేసింది. అలాంటి మన శత్రువులతో కలిసిన వీళ్లా వైఎస్ఆర్ వారసులు. మన ఓట్లను విడగొట్టే కుట్ర చేస్తున్నారు' అని
జగన్ మండిపడ్డారు