గత
టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రావెల కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన
వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, జగన్ల మధ్య తేడాను చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆ
ఫలితాలు పేదలకు వస్తాయని నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.
జగన్ సర్కార్ లో మాత్రం నేరుగా సంక్షేమ పథకాలకే లబ్దిదారులకు అందాలి. మధ్యలో ఎవరూ ఉండకూడదని భావిస్తున్నారన్నారు.