యాదమరి పోలీస్ స్టేషన్ ను ఎస్పీ మణికంఠ గురువారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. మహిళా పోలీసులను వినియోగించుకుని గ్రామాలలో మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని పోగొట్టకుండా విధులు నిర్వహించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలపై కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.