చిత్తూరు:ప్రమాదాలకు నిలయంగా జాతీయ రహదారి

85చూసినవారు
చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని కనికాపురం వద్ద శనివారం లారీ కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. రహదారిలో గుంతలు ఉండడంతో వర్షానికి నీళ్లు చేరాయి. గుంతలలో లారీ, కారు దిగడంతో వాహనాలు వాలి ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. జోడి చింతల నుంచి కనికాపురం మీదుగా ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత పోస్ట్