పిహెచ్సి తనిఖీ చేసిన జిల్లా క్షయ అధికారి

76చూసినవారు
పిహెచ్సి తనిఖీ చేసిన జిల్లా క్షయ అధికారి
దాసుకుప్పం మండలంలోని దాసుకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా క్షయ, కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో క్షయ, కుష్టు వ్యాధికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షయ, కుష్టు వ్యాధి గ్రస్తులకు సకాలంలో చికిత్సలు అందిస్తూ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్