AP: కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి వంతెన వద్ద ఘోర విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఇద్దరి మృతదేహాలను వెలికితీశాయి. మృతులను ఈశ్వర్రెడ్డి, సంపత్రెడ్డి, జయకుమార్లుగా గుర్తించారు. ఇదే ఘటనలో మరో యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు.