విషాదం.. ఈతకెళ్లి ఇద్దరు బాలురులు మృతి

64చూసినవారు
విషాదం.. ఈతకెళ్లి ఇద్దరు బాలురులు మృతి
గుంటూరు జిల్లా నాదెండ్ల మండల పరిధిలోని తూబాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తూబాడు-చిరుమామిళ్ల గ్రామాల మధ్య ఉన్న సాగర్ కాలువలో ఈత కొడదామని వెళ్లిన ఇద్దరు బాలురు నీట మునిగి ప్రాణాలు విడిచారు. మృతులు షేక్ సిద్దిక్ (15), షేక్ అత్తర్ (15)గా గుర్తించారు. నీటి ప్రవాహానికి బాలురు కాలువలో కొట్టుకుపోవడంతో స్థానికులు గమనించి బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్