ట్రావెల్స్ బస్సు బోల్తా.. మహిళ మృతి (వీడియో)

68చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. కర్ణాటక నుంచి యానాంకు వెళ్తున్న ఈ బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక మహిళ మృతి చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 19 మంది స్వల్పంగా గాయపడ్డారు. మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్