తిరుమలలో దళారుల వ్యవస్థను రూపుమాపడంపై టీటీడీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొన్ని విప్లవాత్మక చర్యలపై కసరత్తు మొదలుపెట్టింది. శ్రీవారి దర్శనం టికెట్ల డూప్లికేషన్, నకలీ వెబ్సైట్లు పుట్టుకురావడం, ఆన్లైన్ దరఖాస్తులను మానిప్యులేట్ చేయడం వంటి సమస్యలను పరిష్కరించడానికి నడుం బిగించింది. ఇందులో భాగంగా భక్తులకు అందించే ఆన్లైన్ సేవలన్నింటినీ కూడా ఆధార్ కార్డ్తో అనుసంధానం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.