నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవితో పాటు రాజ్యసభ ఎంపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరడం ఖరారైంది. మార్చి 2వ తేదీన నెల్లూరులో జరిగే బహిరంగ సభ వేదికగా చంద్రబాబు సమక్షంలో ఆయన టీడపీ గూటికి చేరనున్నారు. వేమిరెడ్డితో పాటు ఆయన అనుచరులు, మరికొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.