రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న భారత్

52చూసినవారు
రెండో స్థానాన్ని నిలబెట్టుకున్న భారత్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023-2025 పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ త‌న రెండో స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌పై విజ‌యంతో భార‌త్ 64.58 విజ‌య‌ శాతంతో రెండో స్థానంలో ఉంది. 8 మ్యాచులు ఆడిన భారత్, ఇందులో 5 మ్యాచుల్లో గెలిచింది. రెండు మ్యాచుల్లో ఓడ‌గా ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కాగా ద‌క్షిణాప్రికాపై టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్ 75 విజ‌య‌ శాతంతో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్