ఈ నెల 27వ తేదీన తెలంగాణలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది. చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దు అయింది. మరి ఈ పథకాలను ఇక్కడి నేతలే ప్రారంభిస్తారా? లేక ఇతర నేతలను ఆహ్వానిస్తారా తెలియాల్సి ఉంది.