సీఎం చంద్రబాబు ఫించన్ పంపిణీ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి మంత్రి వర్గంలో యువతికి అవకాశం ఇచ్చానని అన్నారు. ప్రజలు మంత్రులతో పనులు చేయించుకోవాలన్నారు. మంత్రులు కూడా వారిని వారు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేదంటే ప్రూవ్ చేయించాల్సిన బాధ్యత తనపై ఉందని వేదికపై ఉన్న మంత్రులు నారా లోకేష్, కొండపల్లి శ్రీనివాస్లకు బాబు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.