ఇకపై మూడు నెలలకోసారి పెన్ష‌న్లు..!

63చూసినవారు
ఇకపై మూడు నెలలకోసారి పెన్ష‌న్లు..!
ఏపీ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వస్తే పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంచుతామని హామీ అమలు చేస్తోంది. నేడు (జూలై 1న)న రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. ఇదే సమయంలో పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కీలక ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. గత ప్రభుత్వ హాయంలో రద్దు చేసిన ఫించన్ల పునరుద్దరణతో పాటుగా మూడు నెలలకోసారి పెన్షన్లు ఇచ్చే అంశంపైన కసరత్తు చేస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్