ఎల్ కోట మండలంలో టిడిపి ఎన్నికల ప్రచారం

84చూసినవారు
ఎల్ కోట మండలం వీరభద్రపేట లో మండల పార్టీ అధ్యక్షులు చొక్కాకుల మల్లు నాయుడు, మాజీ జడ్పిటిసి కరెడ్లి ఈశ్వరరావు, మాజీ ఎంపీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోమవారం టిడిపి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో మహిళ కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని సాగించారు. టిడిపి మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో టిడిపి గెలుపుకు కృషి చేయాలని కోరారు.

ట్యాగ్స్ :