రైతు భరోసా కేంద్రాల్లో రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలు
జామి మండలంలో గల రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు రాయితీపై పచ్చి రొట్ట విత్తనాలను విక్రయించనున్నట్లు వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు. 10 కేజీల జీలుగ, కట్టెలు విత్తనాలు 50% రాయితీపై 440 రూపాయలకు, 8 కేజీల పిల్లి పెసర ప్యాకెట్ 50% రాయితీపై 536 రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. వీటి వినియోగం ద్వారా ఎరువులు, కలుపు మందులపై రైతులు పెట్టే పెట్టుబడిని పూర్తిగా తగ్గించుకోవచ్చని తెలిపారు.