శ్రీ బంగారమ్మ తల్లిని దర్శించుకున్న లలిత కుమారి

67చూసినవారు
ఎస్ కోట మండలం లచ్చన్న దొరపాలెం మరియు గౌరీపురంలో జరిగిన శ్రీ బంగారమ్మ తల్లి తీర్థ మహోత్సవంలో కూటమి అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గురువారం పాల్గొన్నారు. శ్రీ బంగారమ్మ తల్లిని దర్శించుకుని ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, శ్రీనివాసరాజు, సత్తిబాబు రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :