ఫ్యామలి ఫిజీషియన్ పథకాన్ని ప్రారంభించిన ఎంపిపి

360చూసినవారు
ఫ్యామలి ఫిజీషియన్ పథకాన్ని ప్రారంభించిన ఎంపిపి
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం గోపన్నవలసలో ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఫ్యామలి పిజిషియన్ పథకాన్ని ఎంపిపి తాడ్డి కృష్ణవేణి, మండల వైకాపా అధ్యక్షులు తాడ్డి వేణుగోపాల రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాటాడుతూ ప్రతి సచివాలయం లో నెలకొక రోజు ఆప్ సేవలు ఉంటాయని వాటిని ఆయా సచివాలయ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నెలలో ఒకరోజు ప్రతి సచివాలయంలో ఉదయం 9 నుండి ఆప్ సేవలు ఆ గ్రామములో అందుబాటులో వుంటాయని, ఇక్కడ అన్నిరకాల వ్యాధులకు రక్త పరీక్షలు చేసి మందులు ఇవ్వటం అవుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మెరకముడిదాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సాంబమూర్తి, డైరెక్టర్ కృష్ణ మూర్తి రాజు, ఎంపీటీసీ సీతారామ రాజు పలువురు నేతలు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్