బాపూజీ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన "విజ్ఞాన్" విద్యార్థులు.

574చూసినవారు
చీపురుపల్లి మండలం లో స్థానికంగా ఉన్న విజ్ఞాన్ పాఠశాల విద్యార్థులు తమయొక్క దాతృత్వాన్ని మరొకసారి చాటుకొన్నారు. రావివలసలో ఉన్న బాపూజీ వృద్ధాశ్రమాన్ని సందర్శించి అక్కడ ఉన్న వృద్దులకు పండ్లు మరియు ఫ్రూటీ లు అందచేసి వారియొక్క బాగోగులను అడిగి తెలుసుకొన్నారు. ఆ చిన్నారులు వృద్దులను అడిగిన కుశల ప్రశ్నలకి వృద్దులు భావోద్వేగానికి గురైనారు. అది చూసిన చిన్నారులు మేము ఉన్నాము మీకు మీరు సంతోషంగా వుండండి అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి గారు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్