'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'

849చూసినవారు
'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
గంట్యాడ మండలం నరవ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని.. గంట్యాడ ఎంపీపీ పిరిబండి హైమవతి, జెడ్పిటిసి వర్రి నరసింహ మూర్తి, నరవ గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు కోరారు . మంగళవారం గంట్యాడ మండలంలోని నరవ గ్రామంలో గల రైతు భరోసా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీపీ హైమవతి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రైతన్నల అభివృద్ధి కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు . రైతులు దళారీల బారిన పడకుండా ఉండేందుకు ఈ కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వర్రి నరసింహ మూర్తి, వైసీపీ నాయకులు మోపాడ రాజు ఎంపీటీసీ, సుంకరి రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్