విజయనగరం జిల్లా బొండపల్లి మండలం నెలివాడ గ్రామంలో, సచివాలయ ఆవరణంలో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాళ్లపూడి కీర్తి మాట్లాడుతూ స్వచ్ఛ సంకల్పం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇల్లు, ప్రతి వీధి శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటిలోని చెత్తను తడి పొడి గా విభజించాలని ఆ చెత్తను పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కోరారు.
ఎంపీటీసీ కొమ్మ నాగమణి గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం 100 రోజుల పాటు జరుగుతుందని, ఈ వంద రోజులు దీక్షగా చేయాలని దీనివల్ల ప్రజలకు పారిశుద్ధ పద్ధతులు లు అలవాటుగా మారుతుందనే భావంతో జగనన్న స్వచ్ఛ సంకల్ప వంద రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో, గ్రామ వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు తాళ్లపూడి అప్పలనాయుడు , వార్డ్ నెంబర్లులు, వైయస్సార్ సిపి నాయకులు కునుకు అప్పారావు , మరియు, సచివాలయ సిబ్బంది వాల్ఎంట్రీ లు పాల్గొన్నారు.