కురుపాంలో ఉపముఖ్యమంత్రి రాజన్నదొర పర్యటించారు. 2 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధి ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, మన్యం జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్ రాజు పాల్గొన్నారు.