రోడ్డు మరమ్మతులకు రూ. 11. 75 కోట్లు మంజూరు

69చూసినవారు
రోడ్డు మరమ్మతులకు రూ. 11. 75 కోట్లు మంజూరు
రోడ్డు మరమ్మతులకు కూటమి ప్రభుత్వం రూ. 11. 75 కోట్లు మంజూరు చేసిందని మన్యం జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు సంబంధించి రూ. 11. 75 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం ఈ నెల 18వ తేదీన జి. ఓ ఆర్ టి సంఖ్య. 53 జారీ చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో స్టేట్ హైవే రోడ్‌లకు, జిల్లా ప్రధాన రహదారులకు అనుమతిని ఇచ్చిందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్