మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం

2475చూసినవారు
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరాజాపుపేట గ్రామంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం అన్ని వార్డుల్లో కూడా ఉత్సాహంగా పండగల జరిగిందని రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు అన్నారు. గ్రామంలో 1వ వార్డు, 18వ వార్డు, 19వ వార్డులో ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద, ఆయన ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మీద అక్క చెల్లెమ్మలతో మాట్లాడి వారి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. గడపకు వెలితే మళ్లీ మాకు ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కావాలని, ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు గారే గెలవాలని ప్రతి ఒక్కరు ఆకాంక్షించారని ఆయన అన్నారు. కన్వీనర్సు, కౌన్సిలర్లు, గృహసారదలు నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్