వాడ వాడలా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం...

261చూసినవారు
వాడ వాడలా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం...
నెల్లిమర్ల మున్సిపాలిటీ పరిధి జరాజాపుపేట గ్రామంలో 19 వ వార్డులో జోరుగా మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 19వ వార్డ్ కౌన్సిలర్ తుమ్ము భారతి, వార్డు కన్వీనర్ తుమ్ము నారాయణమూర్తి ఆధ్వర్యంలో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం బీసీ కాలనీలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక గడప కూడా మరల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలవాలని, ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు గెలవాలని ప్రతి ఒక్కరు చెబుతున్నారని ఆమె అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాగవంశం కార్పొరేషన్ డైరెక్టర్ మద్దిల వాసు, జేఏసీ కన్వీనర్ మజ్జి గణేష్, డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు కనకాల హైమావతి, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు తుమ్ము వెంకటరమణ, రాయి త్రినాథ్, మన్యపురి మోహన్ రావు, సుద్దాపు రమణ, మద్దిల రాజారావు, మద్దిల పైడిరాజు, జరజాపు ప్రకాష్, గృహ సారధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్