పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో గురువారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిర్వహించిన సభకు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. సభాస్థలి వద్ద కిక్కిరిసిన జనాభాతో డ్రోన్ వ్యూ ను కూటమి పార్టీ నాయకులు విడుదల చేశారు. జనసేన అభ్యర్థిని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడేందుకు ఓటర్లు, అభిమానులు మద్దతు పలకాలని పవన్ కోరారు.