పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం దట్టమైన పొగ మంచు అలుముకుంది. పొగమంచు దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం దట్టమైన పొగమంచు, మధ్యాహ్నం తీవ్రమైన ఎండలు, రాత్రి వేళల్లో ఉక్కపోతతో వాతావరణంలో మార్పులతో ప్రజలు తీవ్ర స్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.