గంట్యాడలో వరద ఉధృతి

70చూసినవారు
గంట్యాడ మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వాగులు, చెరువులు నిండిపోయాయి. ముఖ్యంగా చంద్రంపేట-వసంత గ్రామాల మధ్య నిర్మితమైన వంతెన పై నుండి వరద నీరు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. ఇప్పటికే రెవెన్యూ సిబ్బంది మరియు పోలీస్ శాఖ వారితో ప్రమాద హెచ్చరికలు బోర్డులు ఏర్పాటు చేశారు. వాహన చోదకులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. వసంత - చంద్రం పేట గ్రామాల మధ్య రాక పోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్