AP: ఈసీ వైఫల్యం వల్లే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు సజావుగా జరిగి ఉంటే వైసీపీకే లాభం జరుగుతుందని, గెలుపుపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. సీఎం జగన్ చేసిన ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, కుప్పంలోనూ వైసీపీ గెలవబోతోందని చెప్పారు. చంద్రబాబు అప్పుడే అధికారంలోకి వచ్చినట్లు భావిస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్లో అక్రమాలు జరిగితే ఎదుర్కొంటామన్నారు.