లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం

82చూసినవారు
లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుపతి పరిపాలన భవనంలో ఆగమ సలహాదారులు, ఉన్నతాధికారులు శనివారం భేటీ అయ్యారు. లడ్డూ అపవిత్రత నేపథ్యంలో సంప్రోక్షణపై సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశంలో టీటీడీ ఈవో శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్