ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల శనివారం విశాఖ విమానశ్రయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొనేందుకు మధ్యాహ్నం హైదరాబాదు నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆమేకు పలువురు కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన్న నగరంలో నోవాటల్ కి బయలుదేరి వెళ్ళారు.