పింపోల్ గుడలో తాగునీటి సమస్య పరిష్కరించాలి

51చూసినవారు
అరకులోయ మండలంలోని పద్మాపురం పంచాయతీ పరిధి పింపోల్ గుడ గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు బుధవారం ఉదయం డిమాండ్ చేశారు. గ్రామస్తుడు రఘుమణి మాట్లాడుతూ. రెండేళ్ల క్రితం గ్రామంలో ఉన్న చేతి పంపు మరమ్మతులకు గురైందన్నారు. దీనితో కొండ వాగుల ద్వారా కొళాయిల్లో వచ్చే కొంచెం నీటితో తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్