జిల్లా చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా

252చూసినవారు
జిల్లా చెరుకు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా
విశాఖ జిల్లా, బుచ్చయ్యపేట మండలం, బుచ్చయ్యపేట గ్రామం లో ఐ ఓబీ బ్యాంకు ఎదరుగా జిల్లా చెరుకు రైతుల సంఘం అధ్యక్షులు కంఠంరెడ్డి నరసింహం ఆధ్వర్యము లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో రైతులు ప్రధాన డిమాండ్లు పరిస్కిరించాలాని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కు తన డిమాండ్లు ముందుంచారు
1. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.
2. సోమనాధ్ కమిటీ సిపార్సులు అమలు చేయాలి
3. రైతు పండించిన పంట కు ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
4. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటికరణ ఆపాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు ను చిన్న చూపు చూస్తున్నాయని, అలాగే రైతులను నా నా కష్టములు పెడుతున్నవి ఆయన అన్నారు
కానుక పై డిమాండ్లు అన్ని జిల్లా చెరుకు రైతుల సంఘం కృషి తో సాధించి తీరుతామని ప్రభుత్వానికి తెలియపరుచు చున్నాము
కాబట్టి మా డిమాండ్లు తీరని పక్షము లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన అన్నారు

ట్యాగ్స్ :