విద్యుత్ దీపాలతో ముస్తాబయిన పెద్దిపాలెం సచివాలయం

66చూసినవారు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం రాత్రి ఆనందపురం మండలంలో జాతీయ భావం వెల్లివెరిసింది. వాడవాడలా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు భారతీయులు తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేస్తున్నారు. పెద్దిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం విద్యుత్ దీపాలతో జాతీయ పతాకం రంగులతో అధికారులు అలంకరించారు. 3 రంగులతో చూడముచ్చటగా కనుల పండుగ వాతావరణం ఆ గ్రామంలో ఏర్పడినది.

సంబంధిత పోస్ట్