పొంగిప్రవహిస్తున్న ప్రధాన డ్రైనేజీ

63చూసినవారు
విశాఖలో భారీ వర్షలు భయాందోళన కలిగిస్తున్నాయి. కాలువలో నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. ఆదివారం ఎంవీపీ కాలనీలోని ప్రధాన డ్రైనేజీలో మురుగునీరు కలిసిపోయి ప్రవహిస్తోంది. రహదారిపైకి మురుగు నీరు పారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన డ్రైనేజీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో నీరంతా ప్రధాన రహదారులపైకి చేరింది.