కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి
కాంగ్రెస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యమని పాడేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శతక బుల్లిబాబు అన్నారు. బుధవారం ఉదయం జి.మాడుగుల మండలంలోని ఉరుములులో ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. పదేళ్ల ప్రధాని మోదీ పాలనలో ప్రజా సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.