జాతరలో వాసవి క్లబ్ భోజనం పంపిణీ

85చూసినవారు
మాడుగుల మోదకొండమ్మ అమ్మవారి జాతర నేపథ్యంలో మంగళవారం మాడుగుల వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో దుర్గమ్మ వారి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసి వారికి ఆకలి తీర్చారు. దీంతో అనేకమంది నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్ శ్రీనివాసరావు సర్వరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్