ప్రజల భూములపై సీఎం జగన్ పెత్తనం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. "ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చి.. ఆస్తులను బలవంతంగా రాసుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు దస్త్రంపైనే రెండో సంతకం చేస్తా. మళ్లీ చంద్రన్న బీమా అమలుచేస్తాం. సహజంగా మారణిస్తే రూ.5 లక్షలు, ప్రమాదంలో చనిపోతే రూ.10 లక్షల బీమా.. కుటుంబానికి అందజేస్తాం." అని చీరాల సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు.