అభ్యర్థులు ఏజెంట్లతో వ్యయ పరిశీలకుల సమావేశం

75చూసినవారు
నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఎన్నికల వ్యయ పరిశీలకుల మొదటి సమావేశం నిర్వహించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయరాం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పిస్తున్న వివరాలను ఎన్నికల ఖర్చుల పరిశీలకులు పూర్తి స్థాయిలో పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఖర్చులు ఉండాలని అధికారులు సూచించారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్