గబ్బాడలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం

65చూసినవారు
నర్సీపట్నం ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమా శంకర్ గణేష్ బుధవారం సాయంత్రం నర్సీపట్నం మండలం గబ్బాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి వైసిపికి మళ్లీ అధికారం ఇవ్వాలని కోరారు. అలాగే నర్సీపట్నం నియోజకవర్గంలో వైసిపి ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. వైసీపీని గెలిపిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్