అభివృద్ధిని ఆదరించి ప్రతి ఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అభ్యర్థించారు. విశాఖలోని రేసపువాని పాలెం గ్రామసభ్యులతో ఆత్మీయ సమావేశం సోమవారం నిర్వహించారు. అనంతరం రైల్వే న్యూ కాలనీ వద్దనున్న రైల్వే గ్రౌండ్స్ లో మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ మేరకు గ్రౌండ్ కు వచ్చిన క్రీడాకారులతో కె కె రాజు కొంతసేపు ముచ్చటించారు.