హర్యానాలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ ఇవాళ బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆయన కుమారుడు బ్రిజేంద్ర సింగ్ గత నెలలో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. కాగా బీరేందర్ 2020లో ఎగువ సభ నుంచి రిజైన్ చేశారు.