ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వ్యవహారంలో ఆప్ నేత సంజయ్సింగ్కి న్యాయస్థానంలో చుక్కెదురైంది. మోదీ విద్యార్హతపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో సంజయ్ సింగ్కు జారీ చేసిన సమన్లను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. మోదీ విద్యార్హతలపై సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ యూనివర్సిటీ పరువు నష్టం కేసు దాఖలు చేసింది. దీంతో సంజయ్సింగ్కు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది.