ఇండియా కూటమి అభ్యర్థితోనే భావితరాలకు భవిష్యత్తు
భావి తరాల భవిష్యత్తు కోసం ఇండియా కూటమి బలపరిచిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు సన్నీబాబు కోరారు. బుధవారం ఉదయం పెదబయలు మండలంలోని ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. ఆదివాసీల అభ్యున్నతి భావి తరాల భవిష్యత్తు కోసం ఇండియా కూటమి బలపరిచిన అరకు ఎంపీ అభ్యర్థిని ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.