గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష

65చూసినవారు
గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష
పెదబయలు మండలంలో మంజూరైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకంలో మంజూరైన ఇండ్లు మార్చి 2025లోపు పూర్తి చేయుటకు లబ్ధిదారులకు సాంకేతిక సహాయం మరియు అవగాహన కల్పించుట కొరకు ముందస్తు చర్యలలో భాగంగా మండలంలో కార్యాలయంలో ఎంపిడిఓ, గృహ నిర్మాణ శాఖ డిఈఈ ఇంజినీరింగ్ అసిస్టంట్లతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మాణం పూర్తి చేయుటకు చర్యలు తీసుకోనున్నట్లు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్