బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం సముద్రతీరాల్లో అలలు ఎగసిపడ్డాయి. ముఖ్యంగా విశాఖలోని ఆర్కేబీచ్, కోస్టల్ బ్యాటరీ ఏరియా బీచ్, తొట్లకొండ, భీమిలి బీచ్, రుషికొండ బీచ్లలో కెరటాలు ఎగసిపడ్డాయి. ఆదివారం అర్ధరాత్రి తుఫాను బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ వద్ద తీరం దాటే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు ఆదివారం తెలిపారు.